యాప్నగరం

మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నప్పుడు కారు ప్రమాదం జరిగింది.

TNN 26 Dec 2017, 6:20 pm
ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా త‌న‌ డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.