యాప్నగరం

సీఎంకు గంటా లేఖ: పార్టీలో కలకలం

వైసీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో అపనమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల విశాఖతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కూడా దెబ్బతింటోందని మంత్రి గంటా పేర్కొన్నారు.

TNN 14 Jun 2017, 3:44 pm
విశాఖ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతున్నాయి.రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో విశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకొని రోడ్డెక్కారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ విచారణకు కూడా ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరి మంత్రి గంటా శ్రీనివాసరావు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం గంటా అయ్యన్న పాత్రుడిపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖ కూడా రాశారు. ఇది టీడీపీలో ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో కూడా విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకలపై కూడా ఇటు వంటి నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని అయ్యన్న ఇరకాటంలో పెట్టారని, ఇలాంటి సంఘటనలను ఆసరా చేసుకుని బొత్స, పురందేశ్వరి, సీపీఐ, సీపీఎం నాయకులు, రోజా తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో ఒక అపనమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని గంటా పేర్కొన్నారు.
Samayam Telugu minister ganta letter creating ruckus among tdp leaders
సీఎంకు గంటా లేఖ: పార్టీలో కలకలం



రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి విశాఖను ఐటి రాజధానిగా..ఒక ఆర్థిక రాజధానిగా.స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంలో చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లాలో పెద్ద ఎత్తున భూ అక్రమణలు జరుగుతున్నాయని..దానికి మన పార్టీ నాయకులు కారకులు అని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పటం ప్రతిపక్షాలకు ఆయుధం అందించటమే అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం వల్ల విశాఖ ప్రతిష్ట దిగజారటమే కాకుండా..దాని ప్రభావం పార్టీపై కూడా పడుతుందని, సీఎం పడుతున్న శ్రమ వృధా అవుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆరోపణలపై సీబీసీఐడీ, సీబీఐ, సిట్టింగ్ జడ్జి, జుడిషియల్ విచారణ జరిపించి నిజా నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిందిగా కోరుతున్నానని తన లేఖలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.