యాప్నగరం

మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై విరుచుకు పడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మంత్రి గోడ మీద పిల్లిలాంటి వారని.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరతారని విమర్శించారు.

Samayam Telugu 23 May 2018, 8:11 pm
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై విరుచుకు పడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మంత్రి గోడ మీద పిల్లిలాంటి వారని.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరతారని విమర్శించారు. ఇప్పుడున్న పార్టీలో రేపటి వరకు ఉంటారో లేదో కూడా గ్యారెంటీ లేదన్నారు. గతంలోనూ పార్టీలు మారిన ఆయన.. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఆయనకు పదవులే ముఖ్యమని.. నీతి నియమాలు లేని ఆయన్ను విమర్శించేందుకు కూడా అర్హుడు కాదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Vijaya Sai


మంగళవారం రోజు జరిగిన ధర్మపోరాట సభకు వ్యతిరేకంగా విశాఖలో.. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుపై బైఠాయించిన విజయసాయి, పార్టీ నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలోనే మంత్రి గంటాతో పాటూ చంద్రబాబుపైనా మండిపడ్డారు. బాబు చేసింది ధర్మ పోరాటం కాదు.. అధర్మ పోరాటమని ఎద్దేవా చేశారు. ఈ సభతో ఆంధ్రా యూనివర్శిటీ అపవిత్రమయ్యిందని.. గంగా జలంతో శుద్ధి చేద్దామనుకుంటే అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.