యాప్నగరం

ఏపీ ఎక్కువ జలాలు వాడుకుంటోంది.. గడ్కరీకి హరీశ్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ కృష్ణా జలాలు వినియోగిస్తోందని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. సోమవారం (ఏప్రిల్ 2) ఆయన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.

Samayam Telugu 2 Apr 2018, 10:28 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ కృష్ణా జలాలు వినియోగిస్తోందని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వినియోగించుకున్న నీటి వివరాలను కూడా ఏపీ ప్రభుత్వం తెలపడం లేదని అన్నారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 2) ఆయన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఓ లేఖ రాశారు.
Samayam Telugu Harish
హరీష్ రావు


నీటి విడుదల అంశంపై దృష్టి సారించేలా సీనియర్ అధికారులతో పర్యవేక్షించాలని హరీశ్ రావు తన లేఖలో కోరారు. వివరాలు తారుమారు చేసే వీల్లేకుండా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని గడ్కరీని హరీశ్ రావు కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.