యాప్నగరం

జగన్‌తో పనిచేయాలా.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావట్లే!

రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుంటే.. జగన్ మరో నాటకానికి తెరతీశారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీని తమతో కలిసి పని చేయాలంటూ వైసీపీ అధినేత పిలుపునివ్వడం చూస్తే.. నవ్వాలో, ఏడవాలో అర్థం కావడంలేదని విమర్శించారు.

TNN 16 Feb 2018, 11:01 pm
రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుంటే.. జగన్ మరో నాటకానికి తెరతీశారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీని తమతో కలిసి పని చేయాలంటూ వైసీపీ అధినేత పిలుపునివ్వడం చూస్తే.. నవ్వాలో, ఏడవాలో అర్థంకావడంలేదని ఆయన విమర్శించారు. ‘టీడీపీది పోరాటాల చరిత్ర. పోరాటం పేరుతో జగన్‌ చేస్తున్న రాజకీయ నాటకాల్లో స్పష్టత లేదు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను, సాగిస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. వైసీపీ ఎంపీల రాజీనామాలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు’ అని ఆయన అన్నారు.
Samayam Telugu minister kalva srinivasulu comments on ys jagan call
జగన్‌తో పనిచేయాలా.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావట్లే!


రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాడినా సహకరిస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు అనేకసార్లు వినిపించారని, అప్పుడు జగన్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంగా ఏ ఒక్కరూ కేంద్రాన్ని ప్రశ్నించలేదని, అప్పుడు గళమెత్తింది చంద్రబాబేనని మంత్రి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.