యాప్నగరం

మెట్రో రైలు స్మార్ట్ కార్డు విడుదల చేసిన మంత్రి కేటీఆర్

ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభోత్సం కానున్న నేపథ్యంలో ఇవాళ...

TNN 25 Nov 2017, 1:20 pm
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభోత్సం కానున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం కోసం మెట్రో రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. నాగోలు నుంచి మెట్టుగూడ మార్గం మధ్య జరిగిన ఈ ట్రయల్ రన్ నిర్వహణ అనంతరం నాగోలులో మెట్రో రైలు అధికారులు మెట్రో సేవలపై ప్రజాప్రతినిధులకి అవగాహన కల్పించారు.
Samayam Telugu minister ktr launches hyderabad metro rail smart card
మెట్రో రైలు స్మార్ట్ కార్డు విడుదల చేసిన మంత్రి కేటీఆర్


ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మెట్రో రైలు నిర్వహణపై అధికారులు తెలిపిన వివరాలని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మెట్రో రైలు స్మార్ట్ కార్డ్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్.. ఈ కార్డు ద్వారా మొత్తం 16 రకాల సేవలని వినియోగించుకోవచ్చని తెలిపారు. దేశంలోనే అతి పొడవైన మెట్రో రైలు మార్గం మన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ సొంతం. 28వ తేదీన మధ్యాహ్నం 2:15 గంటలకి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. ప్రధాని మోదీకి సమయం లేకపోవడం కారణంగానే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం లేదు అని మంత్రి స్పష్టంచేశారు.

మెట్రో రైలు నిర్వహణపై మంత్రి కేటీఆర్ తెలిపిన వివరాల్లో ముఖ్యమైన అంశాలు:

> చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం.
> ఈ నెల 29వ తేదీ నుంచి మూడు నెలలపాటు మెట్రో రైలు సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో వుండనున్నాయి.
> 3 నెలల తర్వాత తెల్లవారుజామున 5:30 గంటల నుంచి రాత్రి 12 గంటలవరకు మెట్రో రైలు సేవలు.
> ఈరోజు రాత్రికి మెట్రో రైలు చార్జీలపై ప్రకటన విడుదల.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.