యాప్నగరం

కూలీ నెం1: కేటీఆర్ ఐస్ క్రీమ్‌కు రూ. 5 లక్షలు

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూలీగా అవతారమెత్తారు. ఈనెల 27న వరంగల్ లో

Samayam Telugu 14 Apr 2017, 6:24 pm
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూలీగా అవతారమెత్తారు. ఈనెల 27న వరంగల్ లో జరుపనున్న టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభకు పార్టీ నేతలు కూలీ దినాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కేటీఆర్ కొంపల్లిలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఐస్ క్రీమ్ అమ్మారు.
Samayam Telugu minister ktr sells ice cream at rs 5 lakh
కూలీ నెం1: కేటీఆర్ ఐస్ క్రీమ్‌కు రూ. 5 లక్షలు


కేటీఆర్ అమ్మిన ఐఎస్ క్రీమ్ ను ఎంపీ మల్లారెడ్డి కొనుగోలు చేసి రూ.5 లక్షలు చెల్లించారు. రెండో ఐస్ క్రీమ్ ను శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేసి రూ.1లక్షల చెల్లించారు.

దీంతో పాటు కుత్బుల్లాపూర్ కేటీఆర్ జ్యూస్, ఐస్ క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజనీరింగ్ గా పనిచేశారు. మొత్తం 25నిమిషాలు కేటీఆర్ చేసిన పనికి రూ.7.30లక్షలు సంపాదించారు.

కేటీఆర్ కాసేపు స్థానికులతో ముచ్చటించారు. టిఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈనెల 14 నుంచి 20 వరకు టిఆర్ఎస్ కూలీ దినాలు పాటించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.