యాప్నగరం

శ్రీనివాస్ హత్యపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి

అమెరికాలో శ్వేతజాతీయుడి ఉన్మాదానికి బలైన తెలుగు యువకుడి మృతిపట్ల తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 25 Feb 2017, 11:33 am
అమెరికాలో శ్వేతజాతీయుడి ఉన్మాదానికి బలైన తెలుగు యువకుడి మృతిపట్ల తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెలలో వంశీ, ఇప్పుడు శ్రీనివాస్, అలోక్ లపై జాత్యాంహకారుల దాడి జరిగిందని ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu minister ktr shocked over india shot dead by american
శ్రీనివాస్ హత్యపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి


అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రజలపై జరుగుతున్న దాడులను అరికట్టేలా విదేశీ వ్యవహారాల శాఖతో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.

Shocked & anguished by the spate of attacks in US. Vamshi last month, Srinivas & Alok now. Will work with MEA to offer support to distressed— KTR (@KTRTRS) February 25, 2017
బుధవారం రాత్రి 7.30గంటలకు కేన్సన్ నగరంలోని ఓ బార్ లో తెలుగు యువకులు శ్రీనివాస్ కూచిబొట్ల, అలోక్ మద్దసానిలు ఉండగా..ఆడామ్ ప్యూరింటన్ అనే ఉన్మాది ‘మా దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి’ అంటూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ అక్కడిక్కడే చనిపోగా అలోక్ గాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్, అలోక్ లను కాపాడే ప్రయత్నంలో ఒక అమెరికన్ యువకుడు కూడా గాయాలపాలయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.