యాప్నగరం

ఆయన కూడా నేరాల గురించి మాట్లాడటం విడ్డూరం : మంత్రి లోకేష్

ట్విట్టర్‌లో కూడా దూకుడు పెంచారు ఏపీ మంత్రి నారా లోకేష్. విపక్షాలు నుంచి వస్తున్న విమర్శలకు ట్వీట్ ద్వారా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ట్వీట్ వార్ ప్రకటించాడు.

Samayam Telugu 4 Jun 2018, 6:13 pm
ట్విట్టర్‌లో కూడా దూకుడు పెంచారు ఏపీ మంత్రి నారా లోకేష్. విపక్షాలు నుంచి వస్తున్న విమర్శలకు ట్వీట్ ద్వారా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ట్వీట్ వార్ ప్రకటించాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. వరుస ట్వీట్లలో 'కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా.. 13 కేసుల్లో ఏ1గా ఉండి.. కండిషనల్ బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, బెట్టింగ్‌లు చేసే వాళ్లు.. ఇలా ఎక్కడ నేరాలు ఉంటే అక్కడ వాళ్లుంటారు. అలాంటి వ్యక్తులున్న పార్టీని ఆయన లీడ్ చేస్తున్నారు' అన్నారు లోకేష్.
Samayam Telugu Nara Lokesh


'అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో నేరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన తండ్రి పాలనలో జరిగిన క్రైమ్ రేట్ గురించి తెలియదా. చంద్రబాబునాయుడు పాలనలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దారిలోకి వచ్చాయి.. నేరాలు తగ్గాయని మరో ట్వీట్ చేశారు మంత్రి. పాదయాత్రలో భాగంగా జగన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై విమర్శలు చేయడంతో.. ఆయనకు కౌంటర్‌గా ఈ ట్వీట్లు చేశారు లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.