యాప్నగరం

పవన్ అంటే గౌరవం.. జగన్ వైఖరేంటో అర్థమయ్యింది: లోకేష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ గౌరవం ఉందంటున్నారు మంత్రి నారా లోకేష్. అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు.

Samayam Telugu 1 Aug 2018, 4:06 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటికీ గౌరవం ఉందంటున్నారు మంత్రి నారా లోకేష్. అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన మంత్రి.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. పవన్ కళ్యాణ్ తనపై పదే, పదే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు లోకేష్. ఆ ఆరోపణల్ని నిరూపించమని ఎన్నోసార్లు సవాల్ విసిరానని.. అయినా ఆయన ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. తనకు అసలు పరిచయం లేని శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయనడం దారుణమన్నారు.
Samayam Telugu Minister Lokesh


తాను అవినీతిపరుడినైతే ఇన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయని ప్రశ్నించారు లోకేష్. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే పవన్ ఎంత బాధపడతారో.. తాను కూడా అలాగే బాధపడ్డానన్నారు. ఇలాంటి ఆరోపణల చేయడం వల్ల రాష్ట్రానికి నష్టమని.. కొన్ని కంపెనీలు పెట్టుబడులకు వెనుకాడుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణం ఆపుతానని కూడా పవన్ అంటున్నారని.. 10మంది కోసం రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన నిర్మాణం ఆగదన్నారు మంత్రి. కేంద్రం బుల్లెట్ ట్రైన్ కోసం భూమిని సేకరించలేకపోతుంటే.. అమరావతిలో ఏకంగా 33వేల ఎకరాలను రైతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

కాపు రిజర్వేషన్లు, జగన్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు లోకేష్. కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష నేత వైఖరేంటో అర్థమయ్యిందని.. ఆయన ఏం మాట్లాడారో కూడా ప్రజలు గమనించారన్నారు. అందుకే అనుభవం ఉన్న నేత కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయినా జగన్ మాట్లాడింది కెమెరాల్లో రికార్డయ్యాయని వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.