యాప్నగరం

ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా హోంమంత్రి

హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశారు.

TNN 19 Apr 2017, 12:21 pm
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశారు. ఆయన చేసిన కాసేపు పనికి రెండు లక్షల రూపాయల కూలీ వచ్చింది. బంజారాహిల్స్ లోని ఒమేగా ఆసుపత్రిలో ఆయన రిసెప్షన్ లో పనిచేశారు. వచ్చిన రోగులకు ఫైల్స్ అందించడం, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకోవడం చేశారు. ఇందుకు గాను ఆ ఆసుపత్రి ఎండీ మోహన్ వంశీ రెండు లక్షల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు. సీఎం కేసీఆర్ గులాబి కూలీ దినాలు పేరుతో ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. వారం రోజుల పాటూ తెరాస నేతలు, మంత్రులు కూలి పనులు చేసి డబ్బులు సంపాదించారు. తెరాస పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఆ సభకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూలి పనులు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలే సంపాదించాలి. కేసీఆర్ కూడా పాలకుర్తిలో కూలిపనుల్లో పాల్గొనబోతున్నారు. ఆయనకు రూ.20 లక్షల దాకా విరాళాలు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు తెరాస నేతలు.
Samayam Telugu minister nayani worked in hospital gets 2 lakhs for trs
ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా హోంమంత్రి



మంత్రి కేటీఆర్ ఇటీవలే ఐస్ క్రీములు అమ్మి ఆరులక్షల రూపాయలు సంపాదించారు. నగరంలోని సుచిత్ర సర్కిల్ లోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆయన ఐస్ క్రీములు అమ్మారు. అనంతరం పక్కనే ఉన్న జ్యూస్ సెంటర్లోను పనిచేసి లక్షా 30 వేల రూపాయలు సంపాదించారు. ఇక ఎంపీ కవిత నిజామాబాద్ లో ఓ షోరూంలో చీరలు అమ్మి రూ.6,90,566 సంపాదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.