యాప్నగరం

వీలైనన్ని రోడ్ బ్రిడ్జిలకు చెక్‌డ్యాంలు: మంత్రి తుమ్మల

రోడ్లు, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే నం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని తుమ్మల అన్నారు.

TNN 11 May 2017, 8:24 pm
రాష్ట్రంలో రూ.2,549 కోట్లతో 511 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టినట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 139 వంతెనల నిర్మాణం పూర్తయ్యాయని, మరో 290 వంతెనల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవన్‌లో మంత్రి ఇవాళ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికంగా వీలైన ప్రతి వంతెనకు చెక్‌డ్యామ్ ఏర్పాటు చేస్తామని, 150 వంతెనలకు ఇప్పటికే పనులు ప్రారంభించామని తెలిపారు.
Samayam Telugu minister tummala review meeting on roads and buildings
వీలైనన్ని రోడ్ బ్రిడ్జిలకు చెక్‌డ్యాంలు: మంత్రి తుమ్మల


‘వంతెనల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కోసం రూ.50 కోట్లతో పనులు చేపట్టాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. రోడ్లు, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే నం.1గా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని తుమ్మల అన్నారు.

రూ.1032 కోట్లతో 26 నూతన జిల్లా కేంద్రాల్లో.. కలెక్టరేట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. ఏడాదిలోగా వాటి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల కలెక్టర్ ఆఫీసుల డిజైన్ నమూనాను ఆయన విడుదల చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ఈ ఏడాది చివరినాటికి పూర్తవుతాయని మంత్రి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.