యాప్నగరం

రాష్ట్ర భవిష్యత్ సినిమాలా ఉందా.. ఆయన ఆశంతా సీఎం కుర్చీపైనే : యనమల

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. పోలవరం, అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 'రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు పోలవరం, అమరావతి చాలా కీలకమైనవి. వాటిని సినిమాలుగా పోల్చడం జగన్ బాధ్యతారాహిత్యం.

Samayam Telugu 13 Jun 2018, 4:49 pm
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. పోలవరం, అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 'రాష్ట్రానికి, భవిష్యత్ తరాలకు పోలవరం, అమరావతి చాలా కీలకమైనవి. వాటిని సినిమాలుగా పోల్చడం జగన్ బాధ్యతారాహిత్యం. రాష్ట్ర సమస్యలపై ఆయనకు కనీసం అవగాహన లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.. ప్రతిపక్ష నేత వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం కుర్చీపై ఉన్న ఆసక్తి.. ప్రజా సమస్యలపై లేవు. వైసీపీ, బీజేపీ, జనసేనలు విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నాయి' అని విమర్శించారు.
Samayam Telugu Yanamala


బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరుపై కూడా యనమల మండిపడ్డారు. 'ప్రధానిని కలిసిన వినతిపత్రం ఇచ్చిన కన్నా.. అందులో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదో చెప్పాలి. కాపుల రిజర్వేషన్ల అంశం కూడా కేంద్రం దగ్గరే పెండింగ్‌లో ఉంది కదా.. దాన్ని కూడా విస్మరించారు. ఉద్దేశపూర్వకంగానే వీటిని వదిలేశారనిపిస్తోంది. రాష్ట్రాలను బలహీన పరిచి.. కేంద్రం బలపడాలని చూస్తోంది. రాష్ట్రాల నిధులతో తమ ఖజానా నింపుకోవాలనుకుంటున్నారు. కేంద్ర పెద్దలు ఒంటెద్దు పోకడల్ని మానుకుంటే మంచిది.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు సాయం అందించాలన్నారు' యనమల.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.