యాప్నగరం

పటాకుల పేలుళ్లలో చిక్కుకున్న హరీశ్ రావు.. సంగారెడ్డి ర్యాలీలో ప్రమాదం

సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్న ఓ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. అప్రమత్తమైన గన్‌మెన్లు ఆయనకు రక్షణగా నిలిచి కాపాడారు.

Samayam Telugu 29 Sep 2018, 2:26 pm
సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావుకు ప్రమాదం తప్పింది. శనివారం (సెప్టెంబర్ 29) ఉదయం హరీశ్ రావు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కంది ఐఐటీ నుంచి జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హరీశ్.. ఓ బైక్‌పై బయలుదేరారు. ఆయనతో పాటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Samayam Telugu Harish


బైక్ ర్యాలీ సంగారెడ్డి పట్టణాన్ని చేరుకునే సందర్భంలో కార్యకర్తల ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. అయితే.. బైక్‌లకు అతిసమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో వారంతా ఆందోళనతో బైక్‌లు వదిలి పరుగు లంఘించుకున్నారు.

సంగారెడ్డిలో హరీశ్ రావు


పలువురు కార్యకర్తలు దూరంగా పారిపోగా.. టపాసుల పేలుళ్లలో హరీశ్ రావు చిక్కుకున్నారు. కాసేపు వాటి పొగల్లోనే ఉండిపోయారు. ఆయనకు ముగ్గురు గన్‌మెన్లు రక్షణగా నిలిచారు. బాణాసంచా పేలుళ్లు అదుపులోకి వచ్చిన తర్వాత హరీశ్‌ను అక్కడ నుంచి తరలించారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.