యాప్నగరం

దారుణం: ప్రేమపేరుతో మైనర్‌ను మోసగించి...

గుంటూరులో ప్రేమపేరుతో ఓ మైనర్ బాలిక దారుణంగా మోసపోయింది.

TNN 22 May 2017, 1:04 pm
గుంటూరులో ప్రేమపేరుతో ఓ మైనర్ బాలిక దారుణంగా మోసపోయింది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడిన వాడే దుర్భుద్ది కొద్ది చేసిన పని... ఆమె జీవితాన్ని నాశనం చేసింది. నలుగురు యువకులు బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె ప్రేమించిన యువకుడి కారణంగానే ఇదంతా జరిగడం గమనార్హం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలోని మధురానగర్‌లో నివసిస్తోంది మైనర్ బాలిక. ఆమెకు హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్న పాటిబండ అఖిల్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మే 16న ఆమెను బయటికి రమ్మని పిలిచాడు. అతడిని నమ్మిన బాలిక అఖిల్ తో పాటూ వెళ్లింది. అఖిల్ అంతకుముందే అజయ్ అనే స్నేహితుడిని కూడా పిలిచాడు.
Samayam Telugu minor sexually abused by lover gangraped by four youth in guntur
దారుణం: ప్రేమపేరుతో మైనర్‌ను మోసగించి...


ఇద్దరూ కలిసి నిర్జన ప్రదేశంలో ఆమెతో బలవంతగా మద్యం తాగించారు. ఆమెపై లైంగిక దాడి చేశారు. స్పృహలో లేని ఆమెను ఇంటికి దగ్గర్లో పడేసి వెళ్లిపోయారు. అటుగా వెళుతున్న నలుగురు యువకులు బాలికను చూశారు. వారిలో దుర్భుద్ధి పుట్టి... ఆమెను ఎత్తుకుని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాలికకు తెలివి వచ్చాక అక్కణ్నించి తప్పించుకుని ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులకు విషయమంతా చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు యువకులను, అలాగే అఖిల్ అతని స్నేహితుడు అజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిలు ఎవరిని నమ్మద్దని ఈ కేసు చెప్పకనే చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.