యాప్నగరం

గర్భవతిని కాకుంటే నేనూ నీదగ్గరికి వచ్చుండేదాన్ని.. అమృత

ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిని యువతి తండ్రి అత్యంత దారుణంగా హత్యచేయించిన ఘటన రెండు రోజుల కిందట మిర్యాలగూడలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Samayam Telugu 16 Sep 2018, 11:06 am
భర్త ప్రణయ్ మృతదేహాన్ని తొలిసారి చూసిన అమృత వర్షిణి గుండెలవిసేలా రోధించింది. ఆదివారం ఉదయం ఆసుపత్రి నుంచి తన నివాసానికి వెళ్లిన ఆమె, విగతజీవిగా పడి ఉన్న ప్రణయ్ చూసి తట్టుకోలేకపోయింది. ప్రణయ్ మరణించాడని తెలియగానే తాను కూడా ఆయన దగ్గరకే వెళ్లిపోవాలనుకున్నా అయితే, నా కడుపులో పెరుగుతోన్న తన ప్రతిరూపం కోసమే బతికున్నానని వాపోయింది. "నేను కన్సీవ్ కాకుంటే ఈ పాటికే నీ దగ్గరికి వచ్చుండేదాన్ని" అంటూ అమృత విలపిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. ఉబికి వచ్చే కన్నీటిని దిగమింగుకుంటూ బంధువులు అమృతను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగేలా, తన కడుపులోని బిడ్డను కని, చక్కగా పెంచుతానని అమృత వ్యాఖ్యానించింది.
Samayam Telugu ప్రణయ్ భార్య అమృత


అంతకు ముందు మీడియాతో అమృత మాట్లాడుతూ.. ప్రణయ్‌‌తో జనవరిలో పెళ్లి జరిగిన వెంటనే తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ కుమార్ తీవ్రంగా బెదిరించారని పేర్కొంది. ఆస్తిలో పైసాకూడా ఇవ్వమన్నారని, జీవితమంతా కష్టాలు పడతావని హెచ్చరించారని తెలిపింది. అయితే, నాకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు.. మమ్మల్ని వదిలేసి ప్రశాంతంగా బతకనీయమని ప్రాధేయపడ్డాడని... ఎంతగా బతిమాలినా ప్రణయ్‌ను తన తండ్రి కనికరించలేదని అమృత తెలియజేసింది. తాము ఎక్కడికి వెళ్లినా ఆయనకు క్షణాల్లో తెలిసిపోయేదని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.