యాప్నగరం

గణేష్ నిమజ్జనం రోజే అపశృతి.. ఇద్దరు మృతి

గణేష్ నిమజ్జనం ఆఖరి రోజుకు చేరుకున్న దశలో రెండు వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తుగా ఇద్దరు మృత్యువాతపడటం...

TNN 5 Sep 2017, 11:53 pm
గణేష్ నిమజ్జనం ఆఖరి రోజుకు చేరుకున్న దశలో రెండు వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తుగా ఇద్దరు మృత్యువాతపడటం స్థానికులకి విషాదంలోకి నెట్టింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం సీగుల్లో గణేష్ విగ్రహాలని నిమజ్జనానికి తరలించే క్రమంలో కరెంట్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో మన్నె సుధాకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Samayam Telugu mishaps in ganeshs immersion in hyderabad
గణేష్ నిమజ్జనం రోజే అపశృతి.. ఇద్దరు మృతి


ఇదిలావుంటే, రంగారెడ్ది జిల్లా షావాన్‌ మండలం కుర్వగూడలో ఇటువంటి అపశృతే మరొకటి చోటుచేసుకుంది. నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా వినాయకుడి మండపం అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ సరఫరాను తొలగించకపోవడంతో అక్కడికి ఆడుకోవడానికి వెళ్లిన మహేష్‌ అనే బాలుడు విద్యుదాఘాతానికిగురై అక్కడికక్కడే చనిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.