యాప్నగరం

పవన్ వ్యాఖ్యలు బాధించాయి.. ఎమ్మెల్యే కిడారి భార్య నిరసన

నా భర్త మరణం నుంచి ఇంకా కోలుకులేదు. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. మావోయిస్టు నేతదే ప్రాణమా.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా ..

Samayam Telugu 16 Oct 2018, 7:37 pm
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనను బాధించాయంటున్నారు.. మావోల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే కిడారి భార్య పరమేశ్వరి. జనసేన అధినేతకు వ్యతిరేకంగా విశాఖలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. మావోలకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల్ని పవన్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తన భర్త మరణం నుంచి ఇంకా కోలుకులేదని.. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దంటూ పరమేశ్వరి విజ్ఞ‌ప్తి చేశారు. భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న తమకు.. ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దన్నారు.
Samayam Telugu Kidari Wife


కిడారి సర్వేశ్వరరావు అనుక్షణం గిరిజనుల కోసం అభివృద్ధి కోసం పరితపించేవారన్నారు పరమేశ్వరి. అలాంటి నిజాయితీ ఉన్న మనుషులు చనిపోతే విమర్శించడం తగదని.. ఆయన ఎలాంటి వ్యక్తో ప్రజలకు కూడా తెలుసన్నారు. మావోయిస్టు నేతదే ప్రాణమా.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా అంటూ ప్రశ్నించారు. పరమేశ్వరి నిరసనకు ఈపీడీఎస్ఎల్ డైరెక్టర్ శోభా హైమావతి కూడా సంఘీభావం తెలిపారు.

జనసేన కవాతు తర్వాత జరిగిన సభలో పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కిడారి హత్యను ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపైనే పరమేశ్వరి తన నిరసనను తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.