యాప్నగరం

కొడుకు కోసం క్షుద్రపూజలు.. బాబుపై రోజా ఫైర్

విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజల ఘటనపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే, సినీ నటి రోజా.

TNN 3 Jan 2018, 3:43 pm
విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజల ఘటనపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే, సినీ నటి రోజా. భవిష్యత్‌లో ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేకుండా చేసి.. ఎప్పటికీ తాను అధికారంలో ఉండేందుకు చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆఖరుకి అమ్మవారి గుడిలో క్షుద్రపూజలు చేసే పరిస్థితికి దిగజారటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు రోజా.
Samayam Telugu mla roja allegations on chandrababu naidu over vijayawada tantrik pooja
కొడుకు కోసం క్షుద్రపూజలు.. బాబుపై రోజా ఫైర్


కొడుకు (లోకేష్) కోసం క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపైకి నెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్రంలో, దేశంలో ఉన్న పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలన్నారు ఎమ్మెల్యే రోజా.

కాగా వివాదాస్పదంగా మారిన దుర్గ గుడిలో తాంత్రిక పూజల ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించి బాధ్యులైన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది దేవాదాయ శాఖ. విచారణ అధికారిగా ఈఈ వెంకటేశ్వరరావును నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.