యాప్నగరం

ఉద్యమంలో లేనివాళ్లే మంత్రివర్గంలో.. తలచుకుంటే కన్నీళ్లు: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్

హోంమంత్రి నాయినీ చేసిన వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నాడు కేసీఆర్‌ను బూతులు తిట్టినవారే నేడు కేబినెట్‌లో కొనసాగుతున్నారని అన్నారు.

TNN 12 Jan 2018, 7:30 pm
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై స్వపక్షం నుంచే విమర్శల పర్వం కొనసాగుతోంది. హోంమంత్రి నాయినీ చేసిన వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నాడు కేసీఆర్‌ను బూతులు తిట్టినవారే నేడు ఆయన కేబినెట్‌లో కొనసాగుతున్నారని హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి.. గురువారం (జనవరి 11) హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో టీజీవో డైరీ ఆవిష్కరణ సభలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నాయినీ వ్యాఖ్యలను సమర్థించారు.
Samayam Telugu mla srinivas goud comments on telangana cabinet
ఉద్యమంలో లేనివాళ్లే మంత్రివర్గంలో.. తలచుకుంటే కన్నీళ్లు: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్


‘ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేని వాళ్లు తెలంగాణ కేబినెట్‌లో ఉన్నారు. ఆ విషయం తలుచుకుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదు, తెలంగాణ లేదు. అప్పుడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్లు ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నారు’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

అయితే.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని భావిస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో కొంత మంది ప‌డ‌గొట్టాల‌ని ప్రయత్నించారని, ఆ స‌మ‌యంలో కేసీఆర్.. రాష్ట్ర కేబినెట్ విషయంలో ఇష్టంలేక‌పోయినా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.