యాప్నగరం

సుజనాతో బంధుత్వం ఉంది.. పార్టీ మారేది లేదు: టీడీపీ ఎమ్మెల్యే

బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందంటున్న టీడీపీ ఎమ్మెల్యే. దమ్ముంటే టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరిన నేత. తాను పార్టీని వీడనని చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే.

Samayam Telugu 26 Jun 2019, 7:49 pm
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఎంపీలతో మొదలైన జంపింగ్ జపాంగ్ చోటామోటా నేతలతో కొనసాగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు కాషాయపార్టీ నేతలకు టచ్‌లోకి వెళ్లారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పార్టీలో ఎవరు కొనసాగుతారు.. ఎవరు గోడ దూకుతారనే చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా అందరి దృష్టి ఎమ్మెల్యేలపైకి మళ్లింది.
Samayam Telugu vamsi


బీజేపీలోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన వంశీ.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు వల్లభనేని.. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఇదంతా బీజేపీ, వైసీపీ నేతల మైండ్ గేమ్ మాత్రమేనని.. తానూ వ్యక్తిగతంగా అందరు ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దమ్ముంటే ఆ పార్టీ నేతలు టచ్‌లో ఉన్న నేతల పేర్లను బయటపెట్టాలన్నారు.

ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో తనకు బంధుత్వం ఉన్నమాట వాస్తవమేనన్నారు వంశీ. బంధుత్వం ఉన్నంత మాత్రాన బీజేపీలోకి వెళ్తానని ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.