యాప్నగరం

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి

స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అయినా... ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు.

TNN 19 Sep 2017, 12:48 pm
ఏపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అయినా... ప్రభుత్వ తీరుపై వంశీ గుర్రుగా ఉన్నారు. తన అసహనాన్ని బయటకే వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కు పంపేసి.. వంశీ అసంతృప్తిని చాటారు. తనకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి పదే పదే విన్నవించినా ఉపయోగం లేకుండా పోయిందని, అందుకే.. తనకు ఉన్న గన్‌మెన్ ను కూడా వంశీ వెనక్కు పంపారు. ఈ విధంగా తన నిరసనను వ్యక్తం చేశారు.
Samayam Telugu mla vamshi expresses displeasure over tdp govt
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి


తనకు టూ ప్లస్ టూ గన్ మెన్ కావాలని వంశీ కోరుతూ వస్తున్నారు. ఈ విషయంలో చాలా సార్లు విన్నపాన్ని చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో.. అసలు భద్రతా సిబ్బందే వద్దు అని గన్ మెన్ ను వెనక్కు పంపించినట్టుగా తెలిపారు. తనకు కేటాయించిన గన్ మెన్ కు కేవలం పిస్టల్ మాత్రమే ఇచ్చారని, మంచి వెపన్ ఏదీ ఇవ్వలేదని పేర్కొన్నారు. తనను ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.

మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు. తన వ్యక్తిగత లైసెన్స్డ్ ఆయుధాలను రెన్యూవల్ కోసం పోలిస్ స్టేషన్లో అప్పగిస్తే వాటిని కూడా తనకు తిరిగివ్వలేదన్నారు.

మరి తమకు భద్రత సరిగా లేదని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వాపోతుండటాన్ని ఇది వరకూ చూశాం. అయితే.. అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే అయినా, ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.