యాప్నగరం

ఎంఎంటీఎస్ రైల్లో అగ్ని ప్రమాదం..

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ప్లాట్‌ఫామ్ పైకి వస్తున్న సమయంలో ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది..

TNN 3 Oct 2017, 12:43 pm
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ప్లాట్‌ఫామ్ పైకి వస్తున్న సమయంలో ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. మంగళవారం (అక్టోబర్ 3) ఉదయం రైలును ప్లాట్‌ఫాం పైకి తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు.
Samayam Telugu mmts engine caught fire at lingampally railway station
ఎంఎంటీఎస్ రైల్లో అగ్ని ప్రమాదం..


సోమవారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇప్పటికే పలు ఎంఎంటీఎస్ రైలు సేవలను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంతో మరిన్ని రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.