రాపూరు దాడి ఘటనపై ఐజీ సీరియస్.. 50మంది నిందితుల గుర్తింపు
నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సైపై దాడి ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇవాళ గుంటూరు ఐజీ గోపాల్ రావు రాపూరు వెళ్లారు.. దాడి ఘటనపై ఆరా తీశారు.
Samayam Telugu 2 Aug 2018, 12:31 pm
నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సైపై దాడి ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇవాళ గుంటూరు ఐజీ గోపాల్ రావు రాపూరు వెళ్లారు.. దాడి ఘటనపై ఆరా తీశారు. అలాగే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఎస్సై లక్ష్మణరావుతో పాటూ ఇద్దరు కానిస్టేబుళ్లను పరామర్శించారు. తర్వాత ఐజీ భద్రతాపరమైన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. గొడవకు కారణాలపై స్థానికంగా కూడా కొంత సమాచారాన్ని ఐజీ సేకరించారు.
ఇలా పోలీస్ స్టేషన్పై దాడి చేయడం సరికాదని.. ఏదైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలంటున్నారు ఐజీ. ఇలాంటి దాడుల్ని ఉపేక్షించేది లేదని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు . పోలీస్ స్టేషన్లో చొరబడిన 50మంది నిందితుల్ని గుర్తించామన్నారు ఐజీ. కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొందరి కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో కొందరు ఊరు వదిలిపెట్టి పారిపోయారని చెప్పారు.
ఓ కేసు విషయంలో వ్యక్తిని స్టేషన్కు తీసుకొచ్చి చేయి చేసుకున్నాడనే కోపంతో అతడి బంధువులు పోలీస్ స్టేషన్లో చొరబడ్డారు. వచ్చీ రాగానే ఎస్సైపై దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లపై కూడా విచక్షణాతహితంగా కొట్టారు. దాడి ప్రమాదాన్ని గుర్తించిన ఎస్సై లక్ష్మణరావు సెల్ లోపలికి వెళ్లగా.. ఆయణ్ని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. ఎస్సై దుస్తులు చింపేసి చెప్పులతో తీవ్రంగా చితకబాదారు.
రవి అనే వ్యక్తి పిచ్చయ్య, లక్షమ్మ, కనకమ్మ అనే ముగ్గురు వ్యక్తులపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై విచారణ చేసిన ఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై ఎస్సై చేయిచేసుకున్నట్లు తెలిసింది. మహిళలని కూడా చూడకుండా ఎస్సై దూషించారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే వీరంతా పీఎస్పై పడి దాడి చేశారు.
ఇలా పోలీస్ స్టేషన్పై దాడి చేయడం సరికాదని.. ఏదైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలంటున్నారు ఐజీ. ఇలాంటి దాడుల్ని ఉపేక్షించేది లేదని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు . పోలీస్ స్టేషన్లో చొరబడిన 50మంది నిందితుల్ని గుర్తించామన్నారు ఐజీ. కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని.. మరికొందరి కోసం గాలిస్తున్నామన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో కొందరు ఊరు వదిలిపెట్టి పారిపోయారని చెప్పారు.
ఓ కేసు విషయంలో వ్యక్తిని స్టేషన్కు తీసుకొచ్చి చేయి చేసుకున్నాడనే కోపంతో అతడి బంధువులు పోలీస్ స్టేషన్లో చొరబడ్డారు. వచ్చీ రాగానే ఎస్సైపై దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లపై కూడా విచక్షణాతహితంగా కొట్టారు. దాడి ప్రమాదాన్ని గుర్తించిన ఎస్సై లక్ష్మణరావు సెల్ లోపలికి వెళ్లగా.. ఆయణ్ని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. ఎస్సై దుస్తులు చింపేసి చెప్పులతో తీవ్రంగా చితకబాదారు.
రవి అనే వ్యక్తి పిచ్చయ్య, లక్షమ్మ, కనకమ్మ అనే ముగ్గురు వ్యక్తులపై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై విచారణ చేసిన ఎస్సై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను స్టేషన్కు పిలిపించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై ఎస్సై చేయిచేసుకున్నట్లు తెలిసింది. మహిళలని కూడా చూడకుండా ఎస్సై దూషించారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే వీరంతా పీఎస్పై పడి దాడి చేశారు.