ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్రానికి దుర్దినమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి మోదీ ఈ గడ్డపై అడుగుపెట్టడం దుర్మార్గం, అపవిత్రం అని ధ్వజమెత్తారు. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆదివారం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విభజన హామీల సాధనకు సోమవారం దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీక్షల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మనం దిల్లీలో దీక్షకు సిద్ధమవుతుంటే, మోదీ ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెబితే వినే వాళ్లెవరూ లేరన్నారు. రఫెల్ కుంభకోణంలో పూర్తిగా కూరుకుపోయిన మోదీ ఇతరుల గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
మోదీ పర్యటన ఏపీకి దుర్దినం: చంద్రబాబు
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం దుర్మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Samayam Telugu 10 Feb 2019, 8:01 am
ప్రధానాంశాలు:
- ప్రధాని మోదీ పర్యటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- ఆయన పర్యటన రాష్ట్రానికి దుర్దినమని అన్నారు.
- ఏపీకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు