యాప్నగరం

మోదీ సతీమణి జశోదా తెలంగాణ పర్యటన!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సతీమణి జశోదాబేన్ తెలంగాణలో ఆకస్మికంగా పర్యటించారు.

Samayam Telugu 14 Apr 2017, 4:38 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సతీమణి జశోదాబేన్ తెలంగాణలో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం వికారాబాద్ లో ఉన్న నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
Samayam Telugu modis wife jashodaben visits vikarabads temple in telangana
మోదీ సతీమణి జశోదా తెలంగాణ పర్యటన!


అనంతరం స్థానికంగా ఉన్న సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అయితే గురువారం రాత్రే జశోదా వికారాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఏలాంటి ఆడంబరాలను తావివ్వకుండా నాగదేవత ఆలయ ప్రధాన అర్చకుడు బరాడి రమేష్ ఇంట్లో బస చేశారు.


శుక్రవారం ఆయన ఇంట్లోనే ఉండి శనివారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగు పయనం కానున్నట్లు తెలిసింది.

జశోదాబేన్ రమేష్ ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న బీజేపీ నేతలు, స్థానిక ప్రజలు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.