యాప్నగరం

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

గతేడాది కంటే ఒక్క రోజు ముందుగా మే 29 న కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు సోమవారం ఆంధ్రప్రదేశ్‌‌ను తాకినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

Samayam Telugu 4 Jun 2018, 2:56 pm
గతేడాది కంటే ఒక్క రోజు ముందుగా మే 29 న కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు సోమవారం ఆంధ్రప్రదేశ్‌‌ను తాకినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురం జిల్లా మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపారు. ఇప్పటికే రుతపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్రల్లో పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రుతుపవనాల రాకతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Samayam Telugu నైరుతి రుతుపవనాలు


గత రెండ్రోజుల నుంచి కోస్తాలో మినహా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లా వత్సవాయిలో అత్యధికంగా 8 సెం.మీల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారాంతానికి బంగాళాఖాతం తీరంలోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు రెండు రోజుల కిందట భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.