యాప్నగరం

త్వరలో చేపల మార్కెట్లు: తలసాని

త్వరలో రాష్ట్రంలో చేపల మార్కెట్లు నిర్మిస్తామని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

Samayam Telugu 23 Dec 2016, 12:04 pm
త్వరలో రాష్ట్రంలో చేపల మార్కెట్లు నిర్మిస్తామని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చేపల మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా చేప పిల్లల పెంపకాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వాతంత్య్రం వచ్చినట్లు బడుగు బలహీన వర్గాలు భావిస్తున్నాయని తెలిపారు. అధికారులు, సొసైటీ సభ్యులు, కుల సంఘాలతో చేపల పెంపకంపై చర్చలు జరిపామని గుర్తు చేశారు. చేపల పెంపకం చేపడుతున్నాం కానీ వాటిని మార్కెట్ చేసేందుకు మార్కెట్లు లేవన్నారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.
Samayam Telugu more fish markets in telangana says minister talasani
త్వరలో చేపల మార్కెట్లు: తలసాని


చేప పిల్లల పెంకపంతో ముదిరాజ్‌లు, గంగపుత్రులు, ఏజెన్సీ ప్రాంతాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. నీలి విప్లవం కొనసాగుతోందని తెలిపారు. చేప పిల్లల పెంపకంపై అన్ని వర్గాల వారు గర్వపడుతున్నారని చెప్పారు. చేపల కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో కేజ్ కల్చర్‌ను ప్రవేశపెడుతామన్నారు. వెనుకబడిన కులాలు, వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా బాగుపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.