యాప్నగరం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

ఉపరిత ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Samayam Telugu 17 Sep 2018, 11:14 am
రానున్న రెండురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్ప పీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 18 నుంచి రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
Samayam Telugu rains


ఉపరిత ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే ఏపీలోని శ్రీకాకుళం, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.