యాప్నగరం

తిరుమల కొండపై తల్లీకొడుకు ఆత్మహత్య

హిందువులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల కొండపై తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

TNN 22 Oct 2017, 4:32 pm
హిందువులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల కొండపై తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. యాత్రికుల వసతి సముదాయమైన ‘మాధవ నిలయం’ ఎదుట ఉన్న రాతి మండపంలో ఆదివారం ఉదయం ఒక మహిళ, పురుషుడు అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వారిద్దరినీ అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Samayam Telugu mother and son commits suicide in tirumala
తిరుమల కొండపై తల్లీకొడుకు ఆత్మహత్య


మృతిచెందిన వారు చిత్తూరు జిల్లాకు చెందిన పుష్ప, శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తల్లీకొడుకులను తెలిపారు. అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగి రాతి మండపంలో పడుకొని నిద్రలోనే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులేమైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.