యాప్నగరం

కాలినడకన తిరుమలకు మోత్కుపల్లి.. బాబు తన గొంతు కోశారంటూ ఫైర్

చంద్రబాబు ఓటమే తన లక్ష్యమంటున్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇవాళ కాలినడక బయల్దేరి వెళ్లి శ్రీవారి సేవలో పాల్గొంటారు

Samayam Telugu 11 Jul 2018, 6:56 am
చంద్రబాబు ఓటమే తన లక్ష్యమంటున్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇవాళ కాలినడక బయల్దేరి వెళ్లి శ్రీవారి సేవలో పాల్గొంటారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పలువురు నేతలు స్వాగతం పలకగా.. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ దయతో రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తుంటే.. చంద్రబాబు నడి బజార్లో తన గొంతు కోశేశారని.. మానసికంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu Motkupalli


రాజకీయాల్లో సేవ చేసేవాళ్లు ఉండాలి కాని.. దుర్మార్గులు కాదన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు నమ్మక ద్రోహని.. రాష్ట్రంలో పేదలను అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీకి శనిలా మారారని.. ఆయన తిరిగి అధికారంలోకి రాకుండా.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్నారు. తనను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. అవన్నీ లెక్క చేయకుండా కాలినడక వెంకన్నను దర్శించుకొని చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని చెప్పారు మోత్కుపల్లి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.