యాప్నగరం

ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మోత్కుపల్లి!

చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి, టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు సంచలన ప్రకటన చేశారు. ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగబోతున్నట్టు స్పష్టం చేశారు.

Samayam Telugu 8 Sep 2018, 2:11 pm
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన ప్రకటన చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. తాను గత 35 ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ప్రజలు తనను దీవించి శానసనభకు పంపాలని మోత్కుపల్లి కోరారు. వచ్చే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబరు 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టు మోత్కుపల్లి తెలిపారు. ఆ సమావేశంలోనే అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Samayam Telugu మోత్కుపల్లి నర్సింహులు


టీడీపీ అధినేత చంద్రబాబుపైనే మోత్కుపల్లి నర్సింహులు బహిరంగ విమర్శలు గుప్పించడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తనపై కుట్రలు పన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేశారని, చంద్రబాబు మాట మీద నిలబడరని మోత్కుపల్లి ఆరోపించారు. తమతో ఉంటానని చెప్పి.. గద్దెనెక్కగానే మరిచిపోయారని, తెలంగాణ వాదులు దాడులు చేస్తుంటే తానే కాపాడానని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబుకు నైతిక విలువలు కూడా లేవని, రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి టీడీపీని నందమూరి వారసులకు అప్పజెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాకూడదని తిరుమల వెళ్లి శ్రీవారికి మొక్కుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.