యాప్నగరం

జగన్ పాదయాత్రలో సినీ ప్రముఖులు

ఎస్వీకే మాట్లాడుతూ.. ఈ సారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. మూడు వేల కిలోమీటర్ల దూరం సాగిన అనంతరం కూడా జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన అద్భుతమన్నారు.

Samayam Telugu 26 Sep 2018, 5:07 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సినీ దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి, ఆయన స్నేహితుడు..మరో నిర్మాత కే అచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీరు జగన్‌ను కలిశారు. సంఘీభావంగా కాసేపు వీరు కూడా పాదయాత్రలో సాగారు.
Samayam Telugu svk


ఎస్వీకే మాట్లాడుతూ.. ఈ సారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. మూడు వేల కిలోమీటర్ల దూరం సాగిన అనంతరం కూడా జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందన అద్భుతమన్నారు. గతంలో కూడా ఎస్వీకే, అచ్చిరెడ్డిలు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారే. జగన్ వివిధ దీక్షలు చేపట్టిన సమయంలో వీరు సంఘీభావం ప్రకటించిన నేపథ్యం ఉంది.

ఈ సినీప్రముఖులిద్దరూ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్లు. ఇటీవలి కాలంలో పలువురు సినీ నటులు, టెక్నీషియన్లు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నారు. వారిలో పోసాని, చోటా కే నాయుడు, కృష్ణుడు, ఫిష్ వెంకట్ తదితరులున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.