యాప్నగరం

లాల్ దర్వాజాలో బంగారు బోనమెత్తిన కవిత

హైదరాబాద్‌ పాతనగరంలో లాల్‌ దర్వాజా బోనాలు ధూంధాంగా జరుగుతున్నాయి. లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు.

TNN 16 Jul 2017, 1:12 pm
హైదరాబాద్‌ పాతనగరంలో లాల్‌ దర్వాజా బోనాలు ధూంధాంగా జరుగుతున్నాయి. లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. మరోవైపు ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకున్నారు. స్వయంగా బోనమెత్తుకుని ఆలయానికి వచ్చిన కవిత.. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. కవిత రాకతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Samayam Telugu mp kavitha offered prayers at lal darwaja temple on the occasion of bonalu festival
లాల్ దర్వాజాలో బంగారు బోనమెత్తిన కవిత


ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌, దేవేందర్‌ గౌడ్‌, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అమ్మవారికి బోనం సమర్పించుకున్నవారిలో ఉన్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాత బస్తీలోని మసీదులు, ఆలయాలు, మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సౌత్ జోన్ డీసీపీ వి. సత్యనారాయణ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.