యాప్నగరం

లోక్‌సభలో నామా, రాజ్యసభలో కేకే.. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతల ఎంపిక

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్టీ లోక్‌సభాపక్ష నేతను, రాజ్యసభ నాయకుడిని, పార్లమెంటరీ పార్టీ నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Samayam Telugu 13 Jun 2019, 4:40 pm
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రగతిభవన్‌లో గురువారం (జూన్ 13) సాయంత్రం జరిగిన ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. జూన్ 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.
Samayam Telugu Nama
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు


లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా జరిగిన ఈ భేటీలో పార్టీ లోక్‌సభాపక్ష నేతను, రాజ్యసభ నాయకుడిని, పార్లమెంటరీ పార్టీ నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె. కేశవరావు ఎంపికయ్యారు. లోక్‌సభాపక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావును ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేతగా ఎంపీ కేశవరావును ఎన్నుకున్నారు. లోకసభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలో వీరిని ఎన్నుకోనున్నారు.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.