యాప్నగరం

ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారంగుండెపోటుతో మృతి చెందారు.

Samayam Telugu 6 Dec 2022, 4:47 pm
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులులో జరుగుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన పాల్వాయి.. కారులో బయలుదేరిన ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు.
Samayam Telugu Palvai


పాత మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నడింపల్లిలో 1936 నవంబర్ 19న పాల్వాయి జన్మించారు. 1967లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాల్వాయి ఐదు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఒక సారి ఎమ్మెల్సీగా పని చేశారు. 2012లో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివేక వర్ధిని డిగ్రీ కాలేజీలో ఆయన బీఏ పూర్తి చేశారు.

ఆయనకు ఇద్దరు కూమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన నివాసముంటున్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్వాయి కీలకంగా వ్యవహారించారని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని పార్టీ నేత మల్లురవి వ్యాఖ్యానించారు.

ఆయన మృతదేహాన్ని రాష్ట్రానికి తరలించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.