యాప్నగరం

ఎమ్మెల్యే కూతురితో ఎంపీ రామ్మోహన్ నిశ్చితార్థం

టీడీపీలో చాలా ఏళ్లుగా ఉన్న రెండు కుటుంబాలు బంధుత్వంతో ఒక్కటయ్యాయి.

TNN 6 Mar 2017, 12:43 pm
టీడీపీలో చాలా ఏళ్లుగా ఉన్న రెండు కుటుంబాలు బంధుత్వంతో ఒక్కటవుతున్నాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ కూతురు శ్రావ్యను వివాహమాడనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్ లో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలకు టీడీపీ నాయకులెంతో మంది హాజరయ్యారు. శ్రావ్య ఇంజినీరంగ్ పూర్తి చేసింది. భరతనాట్యంలో మంచి ప్రావీణ్యముంది. అయితే రామ్మోహన్ శ్రావ్యను తొలిచూపులోన ఇష్టపడినట్టు తెలుస్తోంది. శ్రావ్య అన్నయ్య, రామ్మోహన్ స్నేహితులు. త్వరలో వీరి పెళ్లి జరగనుంది.
Samayam Telugu mp rammohan naidu engaged with mlas daughter
ఎమ్మెల్యే కూతురితో ఎంపీ రామ్మోహన్ నిశ్చితార్థం


శ్రీకాకుళంలో బలమైన నేతగా ఎదిగిన కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడే రామ్మోహన్ నాయుడు. తండ్రి అనుకోకుండా రోడ్డు ప్రమాదం బారిన పడడంతో అనూహ్యంగా రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి గెలిచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.