యాప్నగరం

ఘనంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం

తెలుగుదేశం పార్టీ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి తనయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

TNN 15 Jun 2017, 9:26 am
తెలుగుదేశం పార్టీ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడి తనయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. తెలుగుదేశం మహానాడు జరిగిన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే ఈ వేడుక జరిగింది. కొత్త జంటను కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సురేష్‌ ప్రభు.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ నాయకులు, సినీనిర్మాతలు, వ్యాపారప్రముఖులు తదితరులు హాజరై ఆశీర్వదించారు.
Samayam Telugu mp rammohan naidu married mlas daughter sri sravya
ఘనంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం


కాగా, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రీ శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు. శ్రావ్య, రామ్మోహన్ జంటను చూసిన వారు జోడీ అదిరిందని అంటున్నారు. బండారు ఫ్యామిలీతో కింజారపు కుటుంబానికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడితో కలిసి బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి కుమారుడు, రామ్మోహన్‌నాయుడు మంచి మిత్రులు. ఈ నేపథ్యంలో శ్రావ్యను రామ్మోహన్ పెళ్లాడారు. శ్రావ్య విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భరత నాట్యంలో ఆమెకు మంచి ప్రావిణ్యం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.