యాప్నగరం

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి

అమెరికాలోని గన్ కల్చర్‌కు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.

TNN 12 Feb 2017, 12:14 pm
అమెరికాలోని గన్ కల్చర్‌కు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఉన్నత చదుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీరెడ్డి కుటుంబం హైదరాబాద్‌లోని హబ్సిగూడాలో నివాసం ఉంటోంది. అయితే ఎంఎస్ చదివేందుకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటస్ నగరానికి వెళ్లిన వంశీ శనివారం రాత్రి దారుణ హ్యతకు గురయ్యాడు. ఓ తెల్లజాతి వ్యక్తి తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మిల్పిటస్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Samayam Telugu ms student from hyderabad shot dead in california us
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి బలి


వంశీ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వంశీ మృతదేహాన్ని అక్కడున్న అతని స్నేహితులకు అప్పగించేందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు వస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని పోలీసులు చెప్పినట్లు సమాచారం. అయితే తమ కొడుకు మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కాగా, గతేడాది జులైలోనూ ఓ హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ అనే విద్యార్థిని తోటి విద్యార్థి సాయి సందీప్ గౌడ్ కత్తితో పొడిచి చంపాడు. ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌ వెళ్లి ఒకే రూంలో ఉంటున్న వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో సంకీర్త్‌ను సాయి హతమార్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.