యాప్నగరం

టీడీపీకి ముద్రగడ కొత్త సవాల్!

అదే నిజమైతే స్పందించాలన్నారు..

TNN 4 Sep 2017, 2:19 pm
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ఇచ్చిన కాపుల రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాల్సిందేనని ఉద్యమబాట పట్టిన ముద్రగడ సోమవారం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి మూడు నెలల విరామం ఇచ్చినట్టుగా నాలుగు రోజుల కిందట ప్రకటించారు. అంబేద్కర్ వర్ధంతి వరకూ చంద్రబాబుకు గడువు ఇచ్చి, ఆపై పోరాటం అన్నారు. అయితే.. ఇంతలోనే ఆయన మీడియా ముందుకు వచ్చారు.
Samayam Telugu mudragada chanllenges tdp for advanced polls
టీడీపీకి ముద్రగడ కొత్త సవాల్!


కాపుల రిజర్వేషన్ ఉద్యమం ఎవరికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని ఎలాగైతే హామీ ఇచ్చిందో, కాపుల రిజర్వేషన్ అంశం కూడా అలాంటిదే అని ముద్రగడ అన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన తీరుపై కూడా ముద్రగడ స్పందించారు. అంతటా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని అంటున్నారని, మరి అది నిజమే అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముద్రగడ సవాల్ విసిరారు. వాతావరణం బాగుందంటే ఎన్నికలకు వెళ్లి నిరూపించాలన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు యాభై యేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలాలని కలలుకంటున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.