యాప్నగరం

కాపు రిజర్వేషన్ల బిల్లును వెనక్కు తీసుకోండి.. చంద్రబాబుకు ముద్రగడ లేఖ

ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లును వెనక్కు తీసుకోవాలన్న ముద్రగడ.

Samayam Telugu 11 Sep 2018, 3:06 pm
కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లును వెనక్కు తీసుకోవాలంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అందులో.. గతంలో ఏపీ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ల బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. బిల్లుకు సవరణలు చేసి.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ బిల్లు పెట్టాలన్నారు. ఆ బిల్లును గవర్నర్‌కు పంపి ఆమోదింప చేసి చట్టం చేయాలన్నారు. తర్వాత జీవో ఇచ్చి కాపులకు బీసీ-ఎఫ్ సర్టిఫికేట్లు జారీ చేయాలని కోరారు.
Samayam Telugu Mudragada.


కేంద్రానికి పంపిన 33/2017 బిల్లులో కొన్ని సవరణలు చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారన్నారు ముద్రగడ. సీఎం చంద్రబాబుకు అభ్యంతరం లేకపోతే.. తానే కొంతమంది లాయర్లతో కొత్త బిల్లు తయారు చేయించేందుకు సిద్ధమని లేఖలో ప్రస్తావించారు. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. కాపులకు రిజర్వేషన్లు కల్పించి శుభం కార్డు చూపించాలన్నారు. రిజర్వేషన్లలను రాష్ట్రంలో అమలు చేసి కేంద్రం గురించి ఆలోచించాలన్న ఆయన.. వంకలు చూపించి రిజర్వేషన్ల అంశాన్ని మరింత ఆలస్యం చేయొద్దన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.