యాప్నగరం

​పవన్ కల్యాణ్ ను బతిమలాడాల్సిన అవసరం లేదు!

ఆయనను పదే పదే పిలవాల్సిన అవసరం లేదని, బొట్టు పెట్టి పిలవడానికి ఎవరింట్లోనూ పెళ్లి కాదని ముద్రగడ అన్నారు.

TNN 3 Apr 2017, 8:12 am
కాపుల రిజర్వేషన్ల ఉద్యమంలో కలిసి రావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బతిమలాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు కాపు రిజర్వేషన్ల ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం. ఇది వరకూ ఒకసారి తాము పవన్ కల్యాణ్ కు లేఖ రాశామని, కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం సహకరించమని కోరామని.. అయితే అప్పుడు ఆయన స్పందించలేదని పద్మనాభం తె లిపారు. స్పందించని ఆయనను పదే పదే పిలవాల్సిన అవసరం లేదని, బొట్టు పెట్టి పిలవడానికి ఉద్యమం ఎవరింట్లోనూ పెళ్లి కాదని ముద్రగడ అన్నారు.
Samayam Telugu mudragada slam pavankalyan
​పవన్ కల్యాణ్ ను బతిమలాడాల్సిన అవసరం లేదు!


అధికారంలోకి రాగానే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తానని చంద్రబాబు హామీని ఇచ్చాడని.. ఆ హామీని నిలబెట్టుకోకుండా ఆయన మోసం చేశాడని, ఈ విషయంలో ప్రశ్నిస్తున్నందుకు తమపై ఉక్కుపాదం మోపుతున్నాడని ముద్రగడ ధ్వజమెత్తారు. హామీలను తుంగలో తొక్కి చంద్రబాబు కాపులను దారుణంగా మోసం చేశాడన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తున్నామని.. ఎవరో కొంతమంది రానంత మాత్రాన నష్టం లేదని వ్యాఖ్యానించారు.

మంత్రి పదవి రాకపోయే సరికి బోండా ఉమ లాంటి వాళ్లకు కాపులు గుర్తుకు వచ్చారని, ఇన్నాళ్లూ తనను తిట్టడమే బోండా లాంటి వాళ్లకు పనిగా ఉండేదని ఇప్పుడు పదవి రాకపోయే సరికి ఆయన కాపుల ప్రసక్తి తీసుకొస్తున్నారని ముద్రగడ అన్నారు. అధికార పార్టీలోని కాపు నేతలంతా చంద్రబాబు కుట్రలను గుర్తించాలని ముద్రగడ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.