యాప్నగరం

వైఎస్ జగన్ పై ముద్రగడ విమర్శలు

కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలోనిది కాదని, తను చేయగలిగినవి మాత్రమే చెప్తానని.. చేయలేని వాటి గురించి హామీలు ఇవ్వలేనని

Samayam Telugu 29 Jul 2018, 2:30 pm
కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలోనిది కాదని, తను చేయగలిగినవి మాత్రమే చెప్తానని.. చేయలేని వాటి గురించి హామీలు ఇవ్వలేనని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాపు రిజర్వేషన్ల ఉద్యమ పోరాటకర్త ముద్రగడ పద్మనాభం అభ్యంతరం చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది అని, తను ఏం చేయలేనని.. కాపు కార్పొరేషన్ కు మాత్రం భారీగా నిధులు కేటాయించగలనని జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ముద్రగడ స్పందిస్తూ జగన్ ను విమర్శించారు.
Samayam Telugu mudragada


కేంద్రం పరిధిలోని ఇతర అంశాల గురించి జగన్ మాట్లాడుతున్నారని.. వాటి విషయంలో సానుకూలంగా ఉన్న ఆయన కాపుల రిజర్వేషన్ల అంశంలో మాత్రం ఎందుకు సానుకూలంగా లేరు? అని ముద్రగడ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి తమ జాతి అంటే చిన్నచూపు ఎందుకు? అని అన్నారు. గతంలో తాము కాపు రిజర్వేషన్ల అంశం గురించి పోరాడినప్పుడు, తుని సంఘటన తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఉంటుందని ప్రకటించారని.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ముద్రగడ ధ్వజమెత్తారు.

కాపు రిజర్వేషన్ల ఉద్యమం పుట్టిన గడ్డ మీదే జగన్ ఆ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ అనేక హామీలు ఇస్తున్నారని, వాటి అమలుకు కేంద్ర బడ్జెట్ అయినా సరిపోతుందా? అని ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్లకు మాత్రం ఎందుకు మద్దతునివ్వరు? ముద్రగడ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.