యాప్నగరం

తిరుమలలో ముఖేశ్ అంబానీ.. శ్రీవారి పాదాల చెంత ఈషా పెళ్లి పత్రిక

మంగళవారం వేకువజామున తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ముఖేశ్, అర్చన సేవలో పాల్గొన్నారు.

Samayam Telugu 27 Nov 2018, 3:09 pm
తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌‌ అంబానీ దర్శించుకున్నారు. ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలసి రేణిగుంట, అక్కడ నుంచి సోమవారం అర్ధరాత్రి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం వేకువజామున తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ముఖేశ్, అర్చన సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తె ఈషా వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంబానీ కుమార్తె ఈషా వివాహం డిసెంబరు 12న జరగనుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో వివాహ వేడుకలు నిర్వహించనున్నారు.
Samayam Telugu ambani


పిరామల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ కుమారుడు ఆనంద్‌‌తో ఈషా వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. గత అక్టోబరులో ఇటలీలోని లేక్‌ కోమోలో ఆనంద్‌-ఈషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. అయితే వీరి సంగీత్‌ వేడుకలో అంతర్జాతీయ పాప్‌స్టార్‌ బియాన్సే ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం అంబానీ బియాన్సేకు దాదాపు రూ.15 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బియాన్సే 2 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.