యాప్నగరం

నిరుద్యోగ భృతి: రిజిస్ట్రేషన్ అనధికారిక ప్రారంభం.. 52 వేల దరఖాస్తులు

ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆర్థిక సాయంచేయడానికి ఓ పథకాన్ని ప్రారంభిస్తోంది. తాము అధికారంలో వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చింది.

Samayam Telugu 13 Sep 2018, 8:31 am
గత ఎన్నికల్లో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవేశపెడుతున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ఇప్పటికే అనధికారికంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 52,050 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, నమోదు ప్రక్రియ అధికారికంగా శుక్రవారం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెబ్‌సైట్‌ను పరిశీలనకు ఇప్పటికే అందుబాటులోకి తేవడంతో చాలామంది పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
Samayam Telugu ముఖ్యమంత్రి యువనేస్తం


అలాగే నమోదు చేసుకున్నవారిలో 10,022 మంది ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేసినట్టుగా అందులో పేర్కొన్నారు. 3,135 మంది నుంచి వివిధ ఫిర్యాదులు రాగా, వాటిలో 150 పరిష్కరించినట్టు తెలియజేశారు. ఈ పథకానికి అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాల సమాచారాన్నీ ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రభుత్వం యాప్‌నూ రూపొందించింది. ఈ పథకంపై మంగళవారం శాసనసమండలిలో ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా లోకేశ్‌ను అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.