యాప్నగరం

టీడీపీతో ఇద్దరు కాంగ్రెస్ నేతల సంప్రదింపులు?

ఒకవైపు కాంగ్రెస్ పుంజుకుంటోంది.. అని ఆ పార్టీ ఏపీ నేతలు చెప్పుకుంటుంటే.. మరోవైపు ఆ పార్టీలో మిగిలిన నేతలు మాత్రం పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి

Samayam Telugu 24 Aug 2018, 11:22 am
ఒకవైపు కాంగ్రెస్ పుంజుకుంటోంది.. అని ఆ పార్టీ ఏపీ నేతలు చెప్పుకుంటుంటే.. మరోవైపు ఆ పార్టీలో మిగిలిన నేతలు మాత్రం పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌లో మిగిలిన కొద్దోగొప్పో నేతలు కూడా వేరే పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ జాబితాలో నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, కొండ్రు మరళీమోహన్. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నేతలను కలవడం ఆసక్తిదాయకంగా మారింది.
Samayam Telugu tdcong


ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు ఉగ్రనరసింహా రెడ్డి. గత ఎన్నికల్లో కూడా ఉగ్రనరసింహారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే విజయం సాధించలేకపోయారు. డిపాజిట్ కూడా రాలేదు.

ఇక శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి గతంలో నెగ్గిన కొండ్రు మురళీ మోహన్ పరిస్థితి కూడా ఇంతే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారీయన. అనంతరం వీరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తాజాగా ఉగ్రనరసింహా రెడ్డి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వ్యక్తిగత పనిమీదే తను చంద్రబాబును కలిసినట్టుగా ఆయన తెలిపారు. అయితే నరసింహారెడ్డిని తెలుగుదేశంలోకి ఆహ్వానించారట చంద్రబాబు నాయుడు.

మరోవైపు కొండ్రు మురళీ మోహన్ తో మంత్రి కళా వెంకట్రావు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.