యాప్నగరం

ఉన్నతాధికారి ముఖంపై కాలుపెట్టి బెదిరించిన కాంట్రాక్టర్!

ఓ ఉన్నతాధికారిపై మున్సిపల్ కాంట్రాక్టరు దాడిచేసి, వీరంగం వేసిన ఘటన అనంతపురంలో సోమవారం చోటుచేసుకుంది.

TNN 5 Dec 2017, 9:15 am
ఓ ఉన్నతాధికారిపై మున్సిపల్ కాంట్రాక్టరు దాడిచేసి, వీరంగం వేసిన ఘటన అనంతపురంలో సోమవారం చోటుచేసుకుంది. అనంతపురం నగరపాలక సంస్థ డిప్యూటీ ఇంజినీర్ కిష్టప్పపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడిచేసి బెదిరించిన వీడియో ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. రోడ్లపై చెత్త ఊడ్చే యంత్రాన్ని నగరపాలక సంస్థకు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి సరఫరా చేశారు. ఈ యంత్రం మొత్తం విలులు రూ.38 లక్షలుగా పేర్కోవడంతో నగరపాలక సంస్థ ఇటీవలే రూ.23 లక్షలను నరసింహారెడ్డికి చెల్లించింది. అయితే ఈ యంత్రం కొనుగోలులో ఆరోపణలు రావడంతో మిగతా రూ.15 లక్షలను డీఈ కిష్టప్ప నిలిపివేశారు.
Samayam Telugu municipal contractor attacks anantapur de
ఉన్నతాధికారి ముఖంపై కాలుపెట్టి బెదిరించిన కాంట్రాక్టర్!


దీంతో చెల్లింపులో జాప్యాన్ని ప్రశ్నించేందుకు కార్యాలయానికి చేరుకున్ననరసింహారెడ్డి అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగి, వారిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనిపై డీఈ కిష్టప్ప జోక్యం చేసుకుంటూ మర్యాదగా మాట్లాడాలని హితవు పలికారు. ఆయన అలా అనడంతో మరింత రెచ్చిపోయిన నరసింహారెడ్డి ‘నువ్వెవరు చెప్పడానికి?’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మిలు కూడా ఆయనను వారించారు.

ఈ ఘటన జరిగిన గంట తర్వాత ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న కిష్టప్పను మార్గమధ్యంలో అడ్డుకున్న నరసింహారెడ్డి నడిరొడ్డుపై జనం చూస్తుండగా విచక్షణ రహితంగా దాడిచేశాడు. ముఖంపై కాలుపెట్టి బూతులు తిడితూ తనది జమ్ములమడుగని, ఆఫీసుపై బాంబులేస్తానని హెచ్చరించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు మద్దతుగా నగరపాలక సిబ్బందితోపాటు ఇతర కాంట్రాక్టర్లు పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. అధికారులపై దాడులను సహించబోమని, ఎస్పీని కలిసి నరసింహారెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తామని కమిషనర్ మూర్తి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.