యాప్నగరం

ఉప ఎన్నికలో మా వాళ్లే పోటీ చేస్తారు: మంత్రి

నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.

Samayam Telugu 19 Apr 2017, 3:59 pm
నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
Samayam Telugu my family members will be in nandyalas by poll fray says akhilapriya
ఉప ఎన్నికలో మా వాళ్లే పోటీ చేస్తారు: మంత్రి


అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ శిల్పామోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆయన ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు.

ఈలోపే అఖిలప్రియ ఈ ప్రకటన చేయడంతో శిల్పా వర్గీయులు ఖంగుతిన్నారు. బాబు సూచన మేరకే ఆమె ఆ ప్రకటన చేశారా అనేది ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.