ఏ పదవులొద్దు, పార్టీలోనే ఉంటా.. బాబుతో భేటీలో కేశినేని నాని
లోక్సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్ పదవులు తనకు అవసరం లేదన్నారట నాని. బెజవాడ ప్రజలు తనకు ఎంపీ పదవి అప్పగించారని.. ఆ పదవి తనకు చాలన్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తనను బాధించాయి, అసంతృప్తికి గురిచేశాయన్నారట.
Samayam Telugu 5 Jun 2019, 9:50 pm
ప్రధానాంశాలు:
- కేశినేని నానికి చంద్రబాబు బుజ్జగింపులు
- బాబు బుజ్జగింపులతో మెత్తబడిన కేశినేని
- పార్టీలో ఉంటా.. పదవులొద్దని కుండబద్దలు
టీడీపీని వీడే ప్రసక్తే లేదంటున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. తనకు ఏ పదవులూ అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చంద్రబాబుకు తేల్చి చెప్పారట. లోక్సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్ పదవులు తనకు అవసరం లేదన్నారట. బెజవాడ ప్రజలు తనకు ఎంపీ పదవి అప్పగించారని.. ఆ పదవి తనకు చాలన్నారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తనను బాధించాయి, అసంతృప్తికి గురిచేశాయన్నారట. కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితిని కూడా చంద్రబాబుకు వివరించారట. బుధవారం సాయంత్రం కేశినేని నాని చంద్రబాబును కలిశారు.ఈ భేటీకి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వెళ్లారు. మరోవైపు పార్టీ ఎంపీలంతా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కలిసికట్టుగా పోరాడాలని చంద్రబాబు సూచించారట. మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేతగా తానే ఉండాలని అనుకోవడం లేదన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తన తల్లి విరమించుకున్నారని.. అందుకే చంద్రబాబు పోలిట్ బ్యూరలో అవకాశం ఇచ్చారన్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని.. ఆమె పార్టీ కోసం పనిచేస్తోతున్నారని చెప్పారు. గల్లా కుటుంబానికి రెండు పదవులుగా చూడకూడదని.. ఫ్లోర్ లీడర్గా ఇవ్వాలని గతంలో చంద్రబాబును కోరానని.. ముగ్గురు రెండో సారి ఎంపీలుగా గెలిచినవారమే అని గల్లా వ్యాఖ్యానించారు. తన పదవిని నానికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు.
కేశినేని నాని పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈలోపే పార్లమెంటరీ పదవులు కేటాయింపు కూడా నానికి అసహనం తెప్పించిందట. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్గా కేశినేనిని నియమించినా.. ఆయన ఆ పదవుల్ని తిరస్కరించారు. తనకంటే సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని.. ఎంపీ పదవికంటే ఏదీ తనకు గొప్ప కాదన్నారు. చంద్రబాబు తనను క్షమించాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. నాని వ్యాఖ్యలతో టీడీపీ అధిష్టానం షాక్ తినింది.
వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం అప్రమత్తమయ్యింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను నాని దగ్గరకు పంపింది. విప్ పదవిని తిరస్కరించడానికి గల కారణాలపై ఇద్దరు నేతలు చర్చించారట. విప్ వద్దనడాన్ని రాజకీయం చేయొద్దని.. ఆ పదవిని వద్దనడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారట నాని. తన అభిప్రాయం చెప్పానని.. విభజన హామీలపై ఎంపీగానే పోరాటం చేస్తానన్నారట కేశినేని. పోరాటానికి పదవులు అవసరం లేదని వ్యాఖ్యానించారట.
ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నానికి బుజ్జగింపులు మొదలు పెట్టారట. కేశినేనికి ఫోన్ చేసిన చంద్రబాబు.. సాయంత్రం తనను కలవాలని సూచించారట. చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో నాని కలిశారు. పార్టీ పరిస్థితితో పాటూ తాజా రాజకీయాలపై చర్చించారు. బాబుతో భేటీ తర్వాత కేశినేని కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది.
కేశినేని నాని పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈలోపే పార్లమెంటరీ పదవులు కేటాయింపు కూడా నానికి అసహనం తెప్పించిందట. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్గా కేశినేనిని నియమించినా.. ఆయన ఆ పదవుల్ని తిరస్కరించారు. తనకంటే సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని.. ఎంపీ పదవికంటే ఏదీ తనకు గొప్ప కాదన్నారు. చంద్రబాబు తనను క్షమించాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. నాని వ్యాఖ్యలతో టీడీపీ అధిష్టానం షాక్ తినింది.
వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం అప్రమత్తమయ్యింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను నాని దగ్గరకు పంపింది. విప్ పదవిని తిరస్కరించడానికి గల కారణాలపై ఇద్దరు నేతలు చర్చించారట. విప్ వద్దనడాన్ని రాజకీయం చేయొద్దని.. ఆ పదవిని వద్దనడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారట నాని. తన అభిప్రాయం చెప్పానని.. విభజన హామీలపై ఎంపీగానే పోరాటం చేస్తానన్నారట కేశినేని. పోరాటానికి పదవులు అవసరం లేదని వ్యాఖ్యానించారట.
ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నానికి బుజ్జగింపులు మొదలు పెట్టారట. కేశినేనికి ఫోన్ చేసిన చంద్రబాబు.. సాయంత్రం తనను కలవాలని సూచించారట. చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో నాని కలిశారు. పార్టీ పరిస్థితితో పాటూ తాజా రాజకీయాలపై చర్చించారు. బాబుతో భేటీ తర్వాత కేశినేని కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది.