యాప్నగరం

పవన్‌ని కలిసిన నాదెండ్ల మనోహర్.. జనసేనలో చేరిక లాంఛనమే..!

పవన్‌ను కలిసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్.. జనసేనానితో కలిసి తిరుపతికి బయల్దేరిన మనోహర్.. జనసేనలో చేరిక లాంఛనమే..

Samayam Telugu 11 Oct 2018, 6:06 pm
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేలో చేరడం ఖాయమైనట్లే కనిపిస్తోంది. గురువారం ఉదయం హస్తం పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. సాయంత్రం విజయవాడలో జనసేన అధినేత పవన్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరారు. శుక్రవారం పవన్‌తో భేటీకానున్న మనోహర్.. జనసేనలో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారట.
Samayam Telugu Pawan


మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్.. రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011 నుంచి 2014 వరకు స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో కూడా పని చేశారు.

కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్.. టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. కాని ఆ వార్తల్ని మనోహర్ ఖండించారు. కొద్దిరోజులుగా అనుచరులతో సమావేశమవుతున్న ఆయన.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జనసేనలో చేరాలని నిర్ణయానికి వచ్చి.. పవన్‌ను కలిశారు. ఆ పార్టీ నుంచి తెనాలి నుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.